Thursday, 02 July 2026 05:36:51 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

భూ భార‌తి రైతుల‌కు శ్రీ‌రామ‌ర‌క్ష, మంత్రి పొంగులేటి

Date : 28 April 2025 02:01 PM Views : 777

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28 తెలుగు వెలుగు)భూ భారతి చట్టంలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని... ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని.... రైతులకు భూ భారతి చట్టం శ్రీరామ రక్ష అని అన్నారు. భూ భారతి - 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ చ‌ట్టం చేసేముందు రైతుల క‌ష్టం గురించి ఆలోచించి ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఆ క‌మిటీ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని రైతులకు శ్రీ‌రామ‌ర‌క్ష‌లా నిలిచే విధంగా భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌ని తెలిపారు. గ‌తంలో నాలుగు గోడ‌ల మధ్య స్వార్ధ‌పూరితంగా త‌యారుచేసిన ధ‌ర‌ణి చ‌ట్టానికి మూడేళ్లు గ‌డిచినా నియ‌మ‌నిబంధ‌న‌లు రూపొందించ‌లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండ‌లాల్లో తొలివిడ‌త ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసి అన్ని వివ‌రాలు, ద‌ర‌ఖాస్తులు సేకరిస్తున్నామని, జూన్ 2 నాటికి వీలైన‌న్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి , అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను ప‌ట్టాలుగా అంద‌జేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వివరించారు. భూ య‌జ‌మానుల‌కు న్యాయం జ‌రిగేలా త‌హ‌శీల్దార్ మొద‌లు కొని సీసీఎల్ఎ వ‌ర‌కు ఐదంచెల వ్య‌వ‌స్ద‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సీసీఎల్ఎ వ‌ద్ద కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావిస్తే ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఈ మేర‌కు రాష్ట్రవ్యాప్తంగా అవ‌స‌ర‌మైన‌న్ని ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేనెల 10వ తేదీక‌ల్లా రెవెన్యూ ,గ్రామ‌ ప‌రిపాల‌నాధికారులు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామని తెలిపారు. త‌ప్పుచేసే అధికారుల‌పై చ‌ర్య‌లకు వెనుకాడ‌బోమని స్పష్టం చేశారు. గ‌తంలో రైతు బంధు కోసం గులాబీ రంగు కార్య‌కర్త‌ల‌కు భూమి లేక‌పోయినా ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారని, స‌క్ర‌మంకాని అటువంటి అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వని హెచ్చరించారు. రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు అందేలా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందని ఏ పార్టీ కార్య‌క‌ర్త అనే ప‌క్ష‌పాతం లేకుండా ఇందిర‌మ్మ రాజ్యంలో పేద‌ల‌కు చ‌ట్టం ఒక చుట్టంలా ఉప‌యోగ‌ప‌డేలా చూస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :