తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైది నీ అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఆఫాన్ జైదీ 2 సంవత్సరాల వయసు నుండి, కె ఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడు నుండి ప్రకృతి హరిత దీక్ష తీసుకొని మొక్కలు నాటడం వివిధ వేదికల పైన అతిథులకు మొక్కల్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలపటం, ప్లాస్టిక్ బ్యాగులు వాడ వద్దనీ కాటన్ బ్యాగులు వాడాలని, అందరూ స్టీల్ వాటర్ బాటిల్స్ లలో నీరు తాగాలని ప్రచారం చేస్తూ, వివిధ రకాల గింజలు సేకరించి నాటడం, ఇలా ఇప్పటికి సుమారుగా 5000 పైచిలుకు మొక్కలని వివిధ కార్యక్రమాలలో బొకే బదులు మొక్కలు అందజేశాడు, కొన్ని మొక్కలు కూడా నాటాడు, మనకి మంచి ఆక్సిజన్ నిడని పండ్లు ఫలాలని ఇచ్చేటటువంటి చెట్లని కాపాడు కోకపోతే ఈ విధంగా వీపున మొక్కలు మరియు ఆక్సిజన్ సిలిండర్లు మోయవలసిది వస్తదని, ఆగస్టు 15 న ప్రగతి మైదాన్ లో ప్రచారం చేసే దాన్ని మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చూసి అభినందించారూ, ఈ విధంగా ఇట్లా చిన్నారులకు ప్రకృతి హరిత దీక్ష ఇచ్చి మొక్కలు నాటించే కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేస్తున్నందుకు మొక్కల రాజశేఖర్ ని అభినందించారు, ఈ చిన్నోడి తల్లి తండ్రి అమాన్,రేష్మ, తాతయ్య నానమ్మ ముస్తఫా, పర్వీన్ ల కు అభినందనలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ