Sunday, 01 March 2026 06:06:19 PM
# పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ని ఘనంగా సన్మానించిన సిపిఐ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # డివిజన్ ప్రజల ఆదరాభిమానాలకు రుణపడి ఉంటాం.16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ # మేయర్‌ను కలిసిన ప్రకృతి ప్రేమికులు. # సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. # పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. # 28న జరుగు ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చెయండి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ.

తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.

Date : 25 February 2026 08:12 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తొలి రోజు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ డి. వేణుగోపాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా క్రమబద్ధంగా నిర్వహించబడినట్లు తెలిపారు .ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల, పాల్వంచ లోని పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రతా పంపిణీ విధానం, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, ఇన్విజిలేషన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను సమీక్షించి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడినట్లు తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలు కలిపి మొత్తం 9,685 విద్యార్థులు ఉండగా , అందులో 9,210 మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. జనరల్ విభాగంలో 7,973 మందికి విద్యార్థులు ఉండగా , 7,683 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,712 మంది ఉండగా, 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు .తదుపరి రోజుల్లో నిర్వహించనున్న పరీక్షలు కూడా ఇదే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :