తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ మాట్లాడుతూ జూలూరుపాడు స్టేషన్ పరిధిలోని మీపై కానీ మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని పూర్తి పరిష్కారం (రాజి) చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా మూసివేయడం జరుగుతుందని. కొత్త చట్టాలు అమలైన నేపథ్యంలో కేసులు త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో జిల్లా కోర్టులో సెప్టెంబర్ 23 నుండి 28వ తారీకు వరకు మెగా లోక్ అదాలత్ సేవలను రాజీ పడదగిన కేసులో ఉన్నవారు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిది, దీని ద్వారా సమయం వృధా కాదని, కక్షలు కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని. గొడవ పడిన, ప్రమాదాలు జరిగిన, చీటింగ్, వివాహాలకు సంబంధించిన, చిన్న చిన్న దొంగతనాలు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు మొదలైనవి ఈ మెగా లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి దీనికోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తుడు (రాజీ పడిన వారు) తమ యొక్క ఆధార్ కార్డు తీసుకొని కొత్తగూడెం కోర్టుకు రాగలరని మనవి పూర్తి సమాచారం కోసం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8712682041, కోర్టు కానిస్టేబుల్: 9704694238 మరియు 9959124768 ఈ పై నెంబర్లను సంప్రదించగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ