Thursday, 17 September 2026 07:06:00 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 17 September 2026 06:21 PM Views : 18

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హమారా ప్రసాద్ ను తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని,అతనిపై ఊపా చట్టం కింద కేసు నమోదు చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండలంలోని ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని ప్రపంచమంతా మేధావిగా గుర్తించి ఆయన జయంతిని వరల్డ్ నాలెడ్జి డే గా ప్రకటిస్తే అటువంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ,అంబేద్కర్ పై కల్పిత నాయకుడు పుస్తకాన్ని 18వ తేదీన ఆవిష్కరణ చేస్తానని ప్రకటించిన హమారా ప్రసాద పై గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ వాదులు రాజకీయ పార్టీల నాయకులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ముందే అరెస్టు చేయకపోవడం వల్ల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కల్పిత నాయకుడు పుస్తక ఆవిష్కరణకు పూనుకున్నాడని,ప్రభుత్వ అండదండలు లేకుండానే ఇంత సాహసానికి పూనుకున్నాడా అని ప్రశ్నించారు ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేయడం కాదని అతనిపై ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి బెయిల్ రాకుండా చేయాలని అంబేద్కర్ పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్,బీజేపీ మతోన్మాదులు హమారా ప్రసాద్ తో అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తుంది వాస్తవం కదా అని నిలదీశారు.నిజంగా బీజేపీ వారికి సంబంధం లేకపోతే హమారా ప్రసాద్ అంశంపై మౌనంగా ఎందుకు ఉంటున్నారు బహుజన సమాజానికి సమాధానం చెప్పాలన్నారు.అంబేద్కర్ జీవించి ఉంటే గాడ్సే గాంధీని కాల్చిన విధంగా తాను అంబేద్కర్ ను చంపేవాడిని అని వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.జైభీమ్ రావ్ భారత్ పార్టీ ప్రజా సంఘాల నుండి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉందని అరెస్ట్ చేసిన హమారా ప్రసాద్ కు బెయిల్ రాకుండా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్ , అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, కిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :