Thursday, 18 June 2026 12:10:07 AM
# జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 17 June 2026 05:01 PM Views : 52

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను సులభంగా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. యూరియాను అవసరానికి మించి వినియోగించడం వల్ల భూసార సాంద్రత తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో అధిక మొత్తంలో ఎరువులు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు జరిగిందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు పంటల వైవిధ్యీకరణ, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. టేకులపల్లి మండలంలో ఐదు రైతు వేదికల ద్వారా యూరియా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18001237157 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.గత సీజన్‌లో రికార్డు స్థాయిలో మొక్కజొన్నను 2400 మద్దతు ధరకు కొనుగోలు చేసి, 1800 కు ప్రభుత్వం విక్రయించిందని నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారాలు చేపడుతున్నారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం కూడా అందులో భాగమేనన్నారు.రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా అందజేశారు. టేకులపల్లి పర్యటనలో భాగంగా ఏ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ధారావత్ చుక్కి, భర్త టిక్లీ నిర్మిస్తున్న ఇంటిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతి, నిధుల విడుదల తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులు త్వరగా గృహ ప్రవేశం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లక్కినేని సురేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సర్పంచ్ బోడ బాలు, కొత్తగూడెం ఆర్‌డీఓ మధు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: