Monday, 03 August 2026 10:48:36 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రకృతి మాతను కాపాడుకుందాం. ప్రముఖ ప్రకృతి కవి జయరాజు.

Date : 16 February 2026 07:45 PM Views : 349

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ భూమిపైన సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైందని, ప్రకృతి మాతను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ప్రముఖ ప్రకృతి కవి రచయిత డాక్టర్. జయరాజ్ అన్నారు.విజ్ఞాన దర్శని, దీ నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజ్ఞాన యాత్రలో భాగంగా, యాత్ర బృందం శనివారం కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ప్రేమికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని సఫలీకృతం చేసేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారనీ వెల్లడించారు. ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుందని దాన్ని అర్థం చేసుకుని, రాజ్యాంగ రక్షణకు పాటుపడాలని కోరారు. ప్రపంచంలో క్యాన్సర్ వీరవిహారం చేస్తున్నదని, ప్రాణాంతకమైన క్యాన్సర్ని రూపుమాపేందుకు మనమందరం నిత్యజీవితంలో ప్లాస్టిక్ ని రూపు మాపాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి పైన, రాజ్యాంగం పైన, సైన్స్ పైన, అవగాహనను కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని, దాని దానిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు, ప్రజా వైజ్ఞానికవేత్త రమేష్ మాట్లాడుతూ సైన్సు సాంకేతిక రంగాలలో ప్రపంచం దూసుకుపోతుందని, ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కాలం ఆసన్నమైంది కానీ, మనుషుల్లో మార్పు రాలేదన్నారు. ఒక మెకానికల్ ఇంజనీర్ తన కారుకి చిన్న నట్టు పోతే వేసుకోలేని పరిస్థితి వచ్చింది అన్నారు. ఎలక్ట్రికల్ లో ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్నవారు తన ఇంట్లో ఫీజు పోతే వేసుకోలేని పరిస్థితి ఉందని, దాన్నిబట్టి మనం చదివే చదువుల వల్ల ఉపయోగం ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. చదువులతో పాటు సమాజాన్ని చదవాలని అభివృద్ధి చెందుతున్న సైన్స్ ని అందిపుచ్చుకోవాలని అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు అనంతరం ప్రకృతి ఆశ్రమం సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ జయరాజుకు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్_ శోభారాణి దంపతులకు, అవయవ దానం పై అవగాహన కల్పిస్తున్న అమ్మ నేత్ర శరీర అవయవదాన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఈశ్వర్ లింగం లను ఆశ్రమ సభ్యులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. కన్వీనర్ సుగుణా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు కేహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన యాత్ర చేపట్టడం శుభదాయకమన్నారు.యాత్రకు కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని జాతీయ నాయకురాలు శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి మెహర్ అలీ, ప్రకృతి ఆశ్రమం సభ్యులు శనగ వెంకటేశ్వర్లు, మల్లెల రామనాథం, మొక్కల రాజశేఖర్, ఎల్దండి పూర్ణచంద్రరావు, దయానంద సాగర్, బంగారి శంకర్, బిక్కులాల్, నంది శశి కుమార్, శోభారాణి, రఘు లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :