తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర సమాచార శాఖ లో ఖాళీగా ఉన్న చీఫ్ కమీషనర్,సమాచార కమీషనర్లను వెంటనే నియమించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సమాచార చీఫ్ కమీషనర్ పదవీ బాధ్యతలు గత ఏడాది ఏప్రిల్ లో ముగిసినా గత ప్రభుత్వం కొత్తవారిని నియమించలేదు.సభ్యులుగా ఉన్న ఐదుగురి పదవీ కాలం ఫిబ్రవరి 24తో ముగిసిపోయిందని.దీంతో చీఫ్ కమీషనర్,కమీషనర్లు లేకుండా మొత్తం రాష్ట్ర సమాచార కమీషన్ నిర్వీర్యంగా ఉండిపోయిందన్నారు దీంతో ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం కనిపించడం లేదని,సమాచారం అడిగితే దాపరికం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదిñ నెలలు గడిచినా సమాచార కమీషన్ల నియామకం చేపట్టలేదని,వెంటనే సమాచార కమీషన్ల నియామకం చేపట్టాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ