తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీషపై అత్యాచారం చేసి హత్యచేసిన దుండగుడిని ఎన్కౌంటర్ చేయాలి జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను మాటలాడుతూ మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన శిరీష నర్సింగ్ విద్యాభ్యాసం చేసి కుటుంబ పోషణ కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుందన్నారు. శిరీషను ఓ వ్యక్తి హత్యచేసి, అత్యాచారం చేయడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు గిరిజన మహిళలకు రక్షణ కరువైందని అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్ష పడే విధంగా చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు 30000 ఆర్థిక సహాయం అందించడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ