Sunday, 07 June 2026 07:39:16 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

మనందరికీ మంచి సందేశాన్నిచ్చిన నైనిక – పర్యావరణ పరిరక్షణకు నైనిక కృషిని అభినందించిన కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Date : 27 November 2025 08:41 PM Views : 213

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంత ఉందనే విషయాన్ని తెలియజేస్తూ జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌లో ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా ఇచ్చిన ప్రదర్శనకుగాను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సైన్స్‌ ఫేర్‌ ముగింపు సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ తన ప్రసంగంలో నైనిక రజువా గురించి ప్రస్తావించారు. పర్యావరణంపై గొప్పగా మాట్లాడుతారు కాని మన జిల్లాలో ఎంతో అటవీ సంపద ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా అటవీ ప్రాంతంలో పెరిగే పది ఔషద మొక్కల పేర్లు కూడా తెలియవని అన్నారు. మనకు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు తెచ్చి వేసుకుంటామని, దానికి సైడ్‌ ఎఫెక్ట్స్‌కి మరో మెడిసిన్‌ వేసుకుని మొబైల్‌ చూస్తూ పర్యావరణం బాగోలేదని అనుకుంటాం తప్ప ఆయా చెట్ల గింజలను ఎలా సేకరించాలి, వాటిని మొక్కలుగా ఎలా తయారు చేయాలి, మొక్కలను నాటి పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనే అంశాలను ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. మనకు సాధ్యమైనంత వరకు ఔషద మొక్కలతోపాటు అన్ని రకాల మొక్కల గింజలను సేకరించి, మొక్కలను నాటి పెంచడం ద్వారా ఇలాంటి బాధలు పడాల్సిన అవసరం ఉండదని అన్నారు. మొక్కల పెంపకం వల్ల మనలో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుందని, ఆరోపణలు, ఆవేశాలు అన్నీ తగ్గుతాయన్నారు. ఇతర దేశాల్లో ఔషద మొక్కల పెంపకం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని, మనకు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నందున ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :