తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : C&MD ఎన్. బాలరాం, IRS మార్గదర్శకత్వంలో ఎం షాలెం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం అధ్వర్యంలో చేపట్టిన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచింది. CSR కార్యక్రమం కింద మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, త్రిపుర సహకారంతో 100 మంది మహిళలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొని, మూడు రోజుల సమగ్ర శిక్షణ ఇచ్చి వారికీ C&MD ఎన్. బాలరాం, IRS చేతుల మీదుగా వారికి అని బాక్స్ లను మరియు వాటికీ సంబంధించిన కిట్లను ఇవ్వడం జరిగింది. బుధవారం గరీంపేట్ నందు తేనెటీగల పెంపకం కొరకు ఇచ్చిన బాక్సులను పర్యవేక్షించి తేనెటీగల బాక్స్ నుండి తయారైన తేనెను ఎలా తీయాలో సంబంధిత మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, త్రిపుర వారిచే తేనెను తీయు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం సాలెం రాజు, జిఎం (ఎన్విరాన్మెంట్) బి. సైదులు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం – ప్రకృతి , పంటల రక్షకుడు మరియు తేనె అనేది ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఆహార పదార్థం మాత్రమే కాకుండా ప్రతిరోజు మన ఆరోగ్య జీవన శైలికి ఎంతో తోడ్పడుతుందని తేనెటీగల పరాగసంపర్కం (Pollination) ద్వారా వ్యవసాయ పంటల దిగుబడి పెరుగుతుందని, రైతులకు అధిక ఆదాయం లభిస్తుంది, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో తేనెటీగల పాత్ర అనివార్యం, అందువల్ల ఈ వ్యవసాయ పద్ధతి ప్రకృతితో మమేకమయ్యే ఒక సుస్థిర మార్గం అన్నారు.అలాగే ఈ శిక్షణ ద్వారా మహిళలు, తమ ఇళ్ల వద్దే తేనెటీగల పెంపకం చేసి అదనపు ఆదాయాన్ని పొంధి ఆర్థికంగా స్వావలంబన సాధించగలరని కుటుంబాలను అభివృద్ధి చేసి, సమాజానికి మార్గదర్శకులుగా నిలవగలరని, శిక్షణా కార్యక్రమం పూర్తైన తర్వాత, అన్ని లబ్ధిదారులకు ఉచితంగా తేనెటీగల పెంపక బాక్స్ మరియు అవసరమైన కిట్ (Face Protection Mask, Gloves, Bee Handling Equipment Box) తప్పక ధరించి తేనెను తీయాలని శిక్షణ పొంది ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు తెలియజేశారు , అదనంగా ఏవైనా సందేహాలు లేదా సూచనల కోసం, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ బృందం రెండు సంవత్సరాల పాటు నిరంతర మార్గదర్శకత్వం మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని, లబ్ధిదారులకు సులభంగా సేవలు అందించడానికి మన ప్రాంతంలో వారి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని తేలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం మరియు గౌరవప్రదమైన జీవన విధానాన్ని ఉపాధిని మాత్రమే కాకుండా, వారి జీవితాలను సుస్థిరత, గౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో నింపుతుందని మాకు గట్టి నమ్మకం కూడా అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిఎం (ఎన్విరాన్మెంట్) బి సైదులు, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఎస్ఓఎం ఎన్విరాన్మెంట్ కొత్తగూడెం ఏరియా టి.సత్యనారాయణ, మేనేజర్ (ఫారెస్ట్రీ) రమణారెడ్డి, మేనేజర్ ( ఫారెస్ట్) డేవిడ్ అభిలాష్, డివై పిఎం జి. హరీష్, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (ట్రైనర్స్) మరియు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ