Thursday, 17 September 2026 11:49:52 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 10 September 2026 05:00 PM Views : 382

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం – జిల్లా కలెక్టర్ అంకిత్. సీతాయిగూడెంలో భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. గిరిజనులతో మాట్లాడి రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న కలెక్టర్ .చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, సర్వే ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పరిధిలో మొత్తం 1,823 ఎకరాలకు భూ రీ-సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇటీవల గ్రామ సభను కూడా నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో రీ-సర్వే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు.గ్రామంలో సుమారు 200 వరకు నివాసాలు ఉన్నట్లు అధికారులు వివరించగా, భూమి ఉన్నప్పటికీ పట్టాదారు పాస్‌బుక్‌లు లేని వారు, పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూమి వివరాలు సరిపోని వారు, రికార్డుల్లో భూముల వివరాలు నమోదు కాని సందర్భాలు కూడా ఉన్నట్లు తెలిపారు. భూ రీ-సర్వే పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితిని గుర్తించి, రికార్డుల్లో అవసరమైన సవరణలు చేయడంతో పాటు అర్హులైన భూహక్కుదారులకు పాస్‌బుక్‌లు పొందే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ గ్రామంలోని గిరిజనులతో నేరుగా మాట్లాడి భూ రీ-సర్వే వల్ల వారికి కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియ గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు కలెక్టర్‌కు తెలిపారు. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా భూములకు సంబంధించిన రికార్డుల సవరణలు, ఇతర ప్రక్రియలు పూర్తి చేసుకోలేకపోయిన వారికి ప్రస్తుత రీ-సర్వే ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు. పాత భూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూములను గుర్తించడం ద్వారా తమ భూ హక్కులకు మరింత స్పష్టత లభిస్తుందని గిరిజనులు పేర్కొన్నారు.గ్రామ పరిధిలో అటవీ భూములు కూడా గణనీయంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దగూడెం ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో సుమారు 5,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉండగా, సీతాయిగూడెం గ్రామ పరిధిలో సుమారు 700 నుంచి 800 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం రామవరం, చండ్రుగొండ తదితర అటవీ రేంజ్‌ల పరిధిలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత భూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించారు. సుమారు 1920ల నాటి పాత మ్యాప్‌లు, రికార్డులను పరిశీలిస్తూ అప్పటి భూముల హద్దులు, చెట్లు, కుంటలు, చెరువులు, తోటలు తదితర వివరాలను నమోదు చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన భూ హద్దు రాళ్లు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదని అధికారులు వివరించగా, భూ రీ-సర్వేలో హద్దులను స్పష్టంగా నిర్ధారించి, భవిష్యత్‌లో కూడా సులభంగా గుర్తించే విధంగా శాశ్వత హద్దు గుర్తులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.భూ రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలు తదితర అంశాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూమి ఉండి రికార్డుల్లో నమోదు కాకపోవడం, పాస్‌బుక్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూమి వివరాలు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడి భూమి వివరాలు కూడా రికార్డుల్లో తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రీ-సర్వే ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, సర్వే అధికారులు, అటవి శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :