Wednesday, 16 September 2026 09:07:48 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విస్తృత పర్యటన.

Date : 16 January 2025 07:10 PM Views : 821

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దమ్మపేట మరియు ములకలపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దమ్మపేట మండలం పూసుకుంట మరియు కటుకూరు గ్రామాల కొండరెడ్ల ఆవాసాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొండ రెడ్ల జీవన విధానం వారి అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులను అక్కడ గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొండరెడ్ల అభివృద్ధికి మరియు వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పి హెచ్సీలో అందుబాటులో ఉన్న మందులు వివరాలను అక్కడున్న వైద్యులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించాలని ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు 100శాతం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు ములకలపల్లి మండలం రామానుజయపురం లో ఉన్నటువంటి ఇటుకల తయారీ కేంద్రాన్ని మరియు నర్సరీని కలెక్టర్ సందర్శించారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కలు వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :