Saturday, 01 August 2026 11:50:18 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 01 August 2026 06:20 PM Views : 45

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం. ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ అవసరం. సహజ న్యాయసూత్రాలకు భంగం కలగొద్దు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక బిల్లులో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నిరోధక) బిల్లు - 2026పై అసెంబ్లీ స్పీకర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. కమిటీ చైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యునిగా పాల్గొన్న కూనంనేని సాంబశివరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టే క్రమంలో సాధారణ పౌరుల రాజకీయ విమర్శలకు, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించాలని సూచించారు. బిల్లులోని ద్వేషపూరిత ప్రసంగాల నిర్వచనం, శిక్షలు, జరిమానాలు, డిజిటల్ మీడియా నియంత్రణ నిబంధనలను క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా సాహిత్యం, కళలు, పరిశోధనలు, సమాజ హితం కోసం చేసే విమర్శలకు ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చేలా సహజ న్యాయసూత్రాలను పొందుపరచాలన్నారు. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు అన్ని పక్షాల అభిప్రాయాలతో సమగ్ర నివేదికను శాసనసభకు సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :