తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు లెఫ్ట్ పార్టీలతో పొత్తులతో మునిసిపాలిటీ ఎన్నికలలో పోటీలో ఉండగా జనసేన ఒంటరి పోరుకు సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికల లో ఒంటరి పోరుకు జనసైనికులు సిద్ధమయ్యారు. వేముల కార్తీక్ మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం అంటూ కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికల లో 30 డివిజన్లో పోటీ చేస్తున్నామని ప్రజలు ఆదరించి మా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 55వ డివిజన్ నుండి వేముల అశోక్ పోటీలో ఉంటున్నారని తెలియజేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో సాదిక్ పాషా, మార్గం సందీప్, కొండి శ్రీనివాసరావు జనసేన కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ