తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : దమ్మపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అశ్వారావుపేట ఆధ్వర్యంలో నార్కోటెక్ అధికారుల నేతృత్వంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీను ప్రధాన రహదారిపై నిర్వహించారు ఈ ర్యాలీ ద్వారా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ప్రముఖులు ప్రసంగించారు కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు వివరించారు యువత మంచి భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు తదుపరి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్వారిగూడెం ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాలలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్, దమ్మపేట ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు చిన్న శెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి యుగంధర్ , పగడాల రాంబాబు, ఎమ్మార్వో రామ్ నరేష్, నార్కోటెక్ సిఐ విజయభాస్కర్ రెడ్డి, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, అంగన్వాడి అధికారులు, ప్రభుత్వ డాక్టర్ మణిదీప్ , హెల్త్ అధికారులు, ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి , ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ