తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గౌతంపూర్ పంచాయతీలోని ప్రజలకు నిత్యం అండగా ఉంటా పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాటు చేస్తా ప్రజలకు అసౌకర్యం కలగకుండా డ్రైనేజీల మరియు రోడ్లు నిర్మాణానికి కృషి చేస్తా విస్తృతంగా ప్రచారం చేస్తున్న సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి సపవత్ కళ్యాణి గౌతంపూర్ కాలనీ పంచాయతీ పరిధిలోని అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిపిఐ పార్టీ గౌతాపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సపవత్ కళ్యాణి అన్నారు. పంచాయతీలో సోమవారం ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.గత 2సంవత్సరాలగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పంచాయతీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు,అదే విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా డ్రైనేజీల మరియు రోడ్లను నిర్మాణానికి కూడా కృషి చేస్తానని, పంచాయతీలో పరిశుద్ధ పారిశుధ్యలోపం లేకుండా నిత్యం గౌతంపూర్ పంచాయతీ లో తిరుగుతూ అభివృద్ధి చేస్తానని అన్నారు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు మరియు సింగరేణి గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకుల సహకారంతో నా గెలుపు తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈనెల 14న జరిగే గౌతంపూర్ పంచాయతీ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభర్ధించిన సీపీఐ పార్టీ అభ్యర్ధి సపవత్ కళ్యాణి.
Admin
తెలుగు వెలుగు టీవీ