తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్రాష్ట్ర "అండర్–17" క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకున్న భద్రాద్రి కుర్రోళ్ళు. ఫైనల్స్ లో బీసీసీ (వెస్ట్ గోదావరి)పై బీకేసీఏ (భద్రాద్రి) ఘనవిజయం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో గల తిరుమలగుంట కేవీఎస్ టీగ్రౌండ్ లో గత నాలుగు రోజులుగా జరిగిన "అండర్–17 ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ 2025" క్రికెట్ ట్రోఫీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడానికి చెందిన బీకేసీఏ-17 జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలుకి చెందిన బాలాజీ క్రికెట్ కోచింగ్ (బీసీసీ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఇచ్చిన 88 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో బీకేసీఏ జట్టు చేదించి ఘన విజయాన్ని సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో బీసీసీ జట్టు నుంచి లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్ షిప్ తో దత్త శివరాం 23 పరుగులు, విఘ్నేష్ 34 పరుగులు చేసి మంచి స్కోర్ ని నెలకొల్పారు. బీసీసీ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 87/10 పరుగులు సాధించి తమ ప్రత్యర్థి జట్టు అయిన బీకేసీఏ జట్టుకి 88 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా దిగిన గౌతంరెడ్డి, అబుల్ బర్కత్ స్వల్ప స్కోర్ తో ఆటని కొనసాగించారు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ బరిలోకి దిగిన సాయి సాకేత్, అబుల్ లాంగ్ స్టాండింగ్ పర్ఫామెన్స్ తో మంచి స్కోర్ ని నెలకొల్పారు. థర్డ్ డౌన్లో బ్యాటింగ్ బరిలోకి దిగిన గణేష్, సాయి సాకేత్ ల మధ్య మంచి పార్ట్నర్ షిప్ నెలకొని 88/3తో బీకేసీఏ జట్టు విజయ బావుట ఎగురవేసింది. అదేవిధంగా బీకేసీఏ జట్టు నుంచి బౌలర్ అబుల్ నిర్నీత 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"గా, "బెస్ట్ బౌలర్"గా నిలిచాడు. బీసీసీ జట్టు నుంచి 39 బంతుల్లో 34 పరుగులు సాధించిన విఘ్నేష్ బెస్ట్ బ్యాటర్ గా రాణించాడు. ఈ ట్రోఫీ ఫైనల్స్ లో బీకేసీఏ జట్టు విన్నర్స్ గా నిలవగా, బీసీసీ జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఫైనల్స్ వరకు చేరుకున్న ఇరుజట్లను టోర్నమెంట్ ఆర్గనైజర్లు 50 బాల్స్ క్రికెట్ అకాడమీ ఏపీ జనరల్ సెక్రెటరీ జి. ఆనంద్ బాబు, సహాయ కార్యదర్శి టి.మణికంఠ, బిసౌత్ జోన్ హెడ్ చెన్న ప్రసాద్, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎస్. రవిబాబు అభినందించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమీ (బీకేసీఏ) కోచ్ పంతంగి సాయి నిరంజన్ మాట్లాడుతూ.. తమ ప్లేయర్స్ చక్కటి ఆటను ప్రదర్శించి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేలా కృషి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన వెంట మార్గం నరేందర్, కదిరి నర్సిరెడ్డి ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ