తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ సామాజికవేత్త కోసున శ్రీనివాస్ (పోస్ట్ ఆఫీస్ వాసు) విజ్ఞప్తి ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ డాక్టర్ కె. చిరంజీవికి దేశ అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” అవార్డును ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ సామాజికవేత్త కోసున శ్రీనివాస్ (పోస్ట్ ఆఫీస్ వాసు) విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు దశాబ్దాలుగా నటుడిగా, నృత్య కళాకారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి అందించిన సేవలు అపూర్వమైనవని అన్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి తెలుగు సినిమా ఖ్యాతిని దేశ, విదేశీ వేదికలపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. సినీ రంగంతో పాటు సామాజిక సేవలోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారని కోసున శ్రీనివాస్ పేర్కొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రజలకు ఆయన అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో సినీ కార్మికులు, పేదలు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడంలో చిరంజీవి చూపిన మానవత్వం అభినందనీయమన్నారు. కళా రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి ఇప్పటికే పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు లభించాయని, అయితే కళా సేవతో పాటు సామాజిక సేవా రంగాల్లో చిరంజీవి అందించిన అపూర్వమైన సేవలకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “భారతరత్న” సముచితమైన గౌరవమని కోసున శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటులు, సీనియర్ రాజకీయ నాయకులు సైతం చిరంజీవికి భారతరత్న ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఆ డిమాండ్కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు. తెలుగు ప్రజల తరఫున, కళాభిమానుల తరఫున కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని “భారతరత్న” పురస్కారంతో గౌరవించాలని కోసున శ్రీనివాస్ కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ