Thursday, 17 September 2026 04:24:54 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భూ రీ సర్వేను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్‌ అంకిత్‌

Date : 08 September 2026 07:51 PM Views : 211

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రీ సర్వేను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్‌ అంకిత్‌. సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి.ఎస్‌ఐఆర్‌లో నోటీసుల జారీ, హియరింగ్స్‌, పత్రాల అప్‌లోడ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి తహసీల్దార్లు, సర్వే, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మండలాల వారీగా రీ సర్వే పురోగతిని సమీక్షించారు. రీ సర్వేలో గ్రామసభను మొదటి దశగా నిర్వహించి రైతులకు సర్వే విధానం, తేదీలు, భూ హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామసభలు పూర్తయిన వెంటనే గ్రామ సరిహద్దుల నిర్ణయం, హద్దుల గుర్తింపు, క్షేత్రస్థాయి సర్వే వంటి తదుపరి ప్రక్రియలను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని ఆదేశించారు.మండలాల వారీగా సమీక్షలో కొన్ని గ్రామాల్లో గ్రామ సరిహద్దుల నిర్ణయం, హద్దుల స్థిరీకరణ, సర్వే పనులు కొనసాగుతున్నట్లు, మరికొన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తయి తదుపరి ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి సర్వే ప్రారంభించాలని కలెక్టర్‌ సూచించారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, జీపీఓలు, వీఆర్‌ఓలను సమర్థవంతంగా వినియోగించి రోజువారీ లక్ష్యాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాత భూ రికార్డులు, మ్యాపులను పరిశీలించి, భూ హద్దులు, సర్వే పాయింట్లు, కోఆర్డినేట్ల నమోదులో పూర్తి ఖచ్చితత్వం పాటించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించాలని తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం రైతులకు ఖచ్చితమైన హద్దులు, కోఆర్డినేట్లతో కూడిన భూ మ్యాప్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. మండలాల వారీగా భూముల వివరాలు, భూ హద్దుల నిర్ధారణ, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను సమీక్షించారు. భూ యజమానులతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించి నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడైనా సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించాలని, అవసరమైన శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసుల జారీ, హియరింగ్స్‌ , సంబంధిత పత్రాల ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. మండలాల వారీగా హియరింగ్స్‌ పురోగతిని పరిశీలించి, కొన్ని మండలాల్లో హియరింగ్స్‌ సంఖ్య సిస్టమ్‌లో నమోదు కాకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రుగొండ మండలంలో 24 నోటీసులకు సంబంధించి హియరింగ్స్‌ నిర్వహించినప్పటికీ, సంబంధిత పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతో సిస్టమ్‌లో పురోగతి నమోదు కాలేదని అధికారులు వివరించారు. హియరింగ్‌ నిర్వహించడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జిల్లాలో రాష్ట్రస్థాయి పురోగతి 62 శాతంగా ఉండగా, భద్రాచలం 57.51 శాతం, పినపాక 51 శాతం పురోగతి నమోదైనట్లు సమీక్షలో వెల్లడైంది. గుండాల, పాల్వంచ, పినపాక, అశ్వాపురం, అల్లపల్లి, చంద్రుగొండ, దమ్మపేట, కరకగూడెం తదితర మండలాల్లో నోటీసుల జారీ, హియరింగ్స్‌ పురోగతిని పరిశీలించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన కేసుల్లో హియరింగ్స్‌ నిర్వహించి, సంబంధిత పత్రాలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో నోటీసుల జారీ, హియరింగ్స్‌ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని, నోటీసు జారీ నుంచి హియరింగ్‌, పత్రాల అప్‌లోడ్‌ వరకు ప్రతి దశను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :