Wednesday, 16 September 2026 09:06:14 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడు: ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా

Date : 28 September 2025 06:11 PM Views : 350

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడు: మతోన్మాద శక్తులను ఓడించడమే భగత్ సింగ్ కు నేటితరం అందించగలిగే నిజమైన నివాళి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 118వ జయంతి. షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా పిలుపునిచ్చారు.షహీద్ భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని టూ ఇంక్లైన్ దగ్గర ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ నిర్వహించిన పాత్ర యావత్తు దేశం విస్మరించరానిదని, 12ఏళ్ళ అతి చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 23 ఏళ్ళ యువప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచి దేశ భక్తిని రగిలించిన సమరయోధుడు, విప్లవ మూర్తి భగత్ సింగ్ అని వారు కొనియాడారు. 1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్ 23 ఏళ్ళ చిరు ప్రాయంలోనే 1931 మార్చ్ 23న తన సహచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిపి ఉరితీయబడ్డారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావ శీల విప్లవకారులలో భగత్ సింగ్ అగ్రగణ్యుడని, ఈ కారణంగానే షాహీద్ గా దేశ ప్రజలు కొనియాడారని వారు గుర్తు చేశారు. మతోన్మాద రాజకీయాలను సమూలంగా ఓడించడమే భగత్ సింగ్ కు నేటితరం అందించగలిగే నిజమైన నివాళి అని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యూం ఉపాధ్యక్షులు బరిగెల భూపేష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ రసూల్ పాషా, పట్టణ నాయకులు సల్మాన్, మణికంఠ, అప్రోచ్, సంజయ్, జావీద్, అక్షయ్, రవి, రణధీర్, వంశీ, అన్మోల్, అమన్, అష్రాఫ్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :