తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : మిషన్ భగీరథ పనుల జాప్యంపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం. రోడ్ల ద్వంసం, పైప్ లైన్ల లీకేజీలపై అసహనం. ప్రజలు అవస్థలు పడుతున్నా నిర్లక్ష్యం వీడరా. సమస్య తీవ్రతను గుర్తించి స్పందించకపోవడం సరైందికాదు. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తొలగిచాలి. లీకేజీలను అరికట్టి నీటి సరఫరాను పునరుద్ధరించండి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే. మిషన్ భగీరథ పైపులైన్ పనుల జాప్యం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పట్టణ పరిధిలో జరుగుతున మిషన్ భగీరథ పైపులైన్ పనులతో ధ్వంసం అయిన రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూనంనేని రోడ్ల ద్వంసం, పైప్ లైన్ల లీకేజీలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ప్రజలు అవస్థలు పడుతున్నా నిర్లక్ష్యం వీడరా అని అధికారులును ప్రశ్నించారు. సమస్య తీవ్రతను గుర్తించి స్పందించకపోవడం సరైందికాదునీ, తక్షణమే పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించి లీకేజీలను అరికట్టి నీటి సరఫరాను చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో మళ్లీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. అంబేద్కర్ సెంటర్ లో తక్షణమే సిమెంట్ రోడ్ నిర్మించాలని ప్రధాన జాతీయ రహదారి అయినందున ట్రాఫిక్ సమస్య రాకుండా అని శాఖల సమన్వయంతో రోడ్ నిర్మించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, ఇంచార్జీ కమిషనర్ విజయానంద్ ఎలక్ట్రికల్ Ade అబ్దుల్ రెహమాన్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు నామ కీర్తి గొర్లె అన్నపూర్ణ, పైడిపల్లి జయలక్ష్మి, ఎస్ సుగుణ, మల్లెల స్వప్న కుమారి, దంతబోయిన నరేష్, నాయకులు వీ పద్మజ, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, శెనగారపు శ్రీనివాసరావు, SA రెహమాన్, ys గిరి, గొర్లె నరేష్, నామ పండు, ఆలపాటి ప్రసాద్, అల్లి వెంకటేశ్వర్లు వివిధ శాఖల డి ఈ లు ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ