తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం.విభిన్న సంస్కృతుల కలయికే పీర్ల పండుగ ఉత్సవాలు.మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు నిలుస్తాయి.ఆలీ అబ్బాస్ ఆశూర్ ఖానాకు చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది.ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనమని, ఈ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. మొహరం పండుగను పురస్కరించుకుని కొత్తగూడెం పట్టణ పరిధిలోని బూడిదగడ్డ ఏరియా, 49వ డివిజన్లలోని చారిత్రాత్మక అలీ అబ్బాస్ ఆషూర్ ఖానాను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా తిలకించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లింలు కలిసిమెలిసి జరుపుకునే పీర్ల పండుగ మన సంస్కృతికి అద్దం పడుతుందని కొనియాడారు. సమాజంలో శాంతిసౌభ్రాతృత్వాలు విలసిల్లాలని, ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ఆషూర్ ఖానాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నిరంతరం శ్రమించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ అనీష్, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి, కార్పొరేటర్ విజయ్, బండి నర్సింహా, సిపిఐ పట్టణ నాయకులు ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ