Thursday, 02 July 2026 04:24:27 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 26 June 2026 08:57 PM Views : 135

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం.విభిన్న సంస్కృతుల కలయికే పీర్ల పండుగ ఉత్సవాలు.మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు నిలుస్తాయి.ఆలీ అబ్బాస్ ఆశూర్ ఖానాకు చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది.ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనమని, ఈ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. మొహరం పండుగను పురస్కరించుకుని కొత్తగూడెం పట్టణ పరిధిలోని బూడిదగడ్డ ఏరియా, 49వ డివిజన్లలోని చారిత్రాత్మక అలీ అబ్బాస్ ఆషూర్ ఖానాను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా తిలకించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లింలు కలిసిమెలిసి జరుపుకునే పీర్ల పండుగ మన సంస్కృతికి అద్దం పడుతుందని కొనియాడారు. సమాజంలో శాంతిసౌభ్రాతృత్వాలు విలసిల్లాలని, ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ఆషూర్ ఖానాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నిరంతరం శ్రమించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ అనీష్, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి, కార్పొరేటర్ విజయ్, బండి నర్సింహా, సిపిఐ పట్టణ నాయకులు ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :