తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్ ని ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో సిపిఐ యువజన సంఘం(ఏఐవైఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యుడు బరిగెల భూపేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించి అనంతరం కొత్తగూడెం ప్రధమ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సిపిఐ, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బరిగెల సాయిలు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయనకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ అమరజీవి బరిగెల సాయిలు లేని లోటు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అన్నారు. బరిగెల సాయిలు ప్రజాప్రతినిధిగా మొదటి మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొత్తగూడెం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి తో పాటు సింగరేణి కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బండి నరసింహారావు, సిపిఐ త్రీ టౌన్ కార్యదర్శి మహమ్మద్ యూసఫ్, సిపిఐ నాయకులు జక్కుల రాములు, ఏఐటీయూసీ నాయకులు సామర్ల సమ్మయ్య మాటేటి అంజయ్య, కొర్ర శ్రీనివాస్,రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ