తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతనంగా ఎన్నికైన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ను మంగళవారం ప్రకృతి ప్రేమికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో మేయర్ గణేష్ను ప్రకృతి హరితదీక్ష వ్యవస్థాపకులు, మన్కీ బాత్లో ప్రధాని మోడీచే ప్రశంసలు అందుకున్న గ్రీన్ గార్డెన్ వెహికిల్ సృష్టికర్త, సింగరేణియన్ మొక్కల రాజశేఖర్, ప్రకృతి హరిదీక్ష గౌరవ సభ్యులు శనగ కళ్యాణ్ కుమార్, ప్రకృతి హరితదీక్షకురాలు చిన్నారి నైనిక రజువా కలిసి మొక్కలను అందచేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్కు ప్రకృతి హరితదీక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతిరోజు కనీసం ఒక్క మొక్కనైనా నాటడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టడం జరిగింధని, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు సైతం లభించాయని మొక్కల రాజశేఖర్ తెలిపారు. అనంతరం మేయర్ గణేష్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ కోసం హరిదీక్ష చేపట్టడం ఎంతో అభినందనీయమని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. హరితదీక్షకురాలు నైనిక రజువాను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవడం శుభపరిణామమని, నైనికను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ్ రజువా, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ