Thursday, 14 May 2026 02:20:55 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఐ.ఎల్.పీ.ఏ సభ్యత్వాన్ని స్వీకరించిన జిల్లా న్యాయవాది యెర్రా కామేష్

Date : 27 May 2025 07:33 PM Views : 489

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) సభ్యత్వాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,న్యాయవాది యెర్రా కామేష్ మరియు న్యాయవాది పగిడిపల్లి శ్రీకాంత్ లు సోమవారం జిల్లా బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్ నందు ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ జే.గోపికృష్ణ చేతుల మీదుగా సభ్యత్వాన్ని స్వీకరించారు.ఈసంధర్భంగా యెర్రా కామేష్ మాట్లాడుతూ ఐ.ఎల్.పీ.ఏ వంటి రాజ్యాంగపరమైన విలువలకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలో సభ్యత్వం పొందడం గర్వకారణమని, మహాత్మా జ్యోతిరావ్ పూలే, డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచనలు మన సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, వారు ప్రతిపాదించిన సమానత్వం,స్త్రీ,పురుష సమానహక్కులు, నిరుపేదలకు న్యాయానుకూల అవకాశాలు ఇవన్నీ నేడు మరింత అవసరమైన అంశాలని.ఈసిద్ధాంతాల ఆధారంగా న్యాయ సేవలను ప్రజల దాకా తీసుకెళ్లేందుకు,అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించే దిశగా పని చేయడానికి ఐ.ఎల్.పీ.ఏ వేదికగా కృషి చేస్తామని తెలియజేశారు.జిల్లా కన్వీనర్ జే.గోపికృష్ణ వారిని అభినందిస్తూ ఐ.ఎల్.పీ.ఏ సంస్థలో నూతనంగా చేరిన న్యాయవాదులు సమాజసేవ పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయమన్నారు.పూలే–అంబేడ్కర్ మార్గదర్శకత్వంలో సమానత్వం కోసం నిరంతరంగా పోరాడే ఈసంస్థలో వారి భాగస్వామ్యం ఎంతో శక్తినిచ్చే అంశమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మారపాక రమేష్ కుమార్, సభ్యత్వ ఇంచార్జ్ సాధిక్ పాషా, న్యాయవాదులు అంబటి రమేష్, మహిళా న్యాయవాది సరిత, వడ్లకొండ హరిప్రసాద్, కనకం చిన్ని కృష్ణ,ధరావత్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :