Thursday, 02 July 2026 05:37:23 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

ఓపెన్ స్కూల్ ఫలితాలలో స్టార్ చిల్డ్రన్ స్కూల్ అభ్యాసకుల ఉత్తమ ప్రతిభ

Date : 08 June 2025 07:08 PM Views : 461

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ తాజా పరీక్షా ఫలితాలలో స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ స్టడీ సెంటర్ తన శిక్షణా నాణ్యత ను మరోసారి నిరూపించుకుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులలో ఎక్కువమంది అత్యుత్తమ మార్కులు సాధించినట్లు ఏ ఐ కోఆర్డినేటర్ జి భాస్కర్ రావు ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలియజేసినారు. చదువుకు వయసుకు సంబంధం లేదని, చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ విద్యా విధానం అత్యుత్తమ వేదిక అని పేర్కొన్నారు. తమ సెంటర్ నుండి పరీక్ష వ్రాసి సబ్జెక్టుల వారిగా అత్యుత్తమ మార్కులు సాధించిన వారి వివరాలను తెలియజేస్తూ ఇంటర్ ఇంగ్లీష్ లో ఎర్రబోయిన నేహా శ్రీ 87, తెలుగులో కొమరం నాగమణి 88, పొలిటికల్ సైన్స్ లో కొర్ర హరిబాబు, కాల్వ అక్షయ్ 94 , అర్థశాస్త్రంలో పెర్సాని సాయి హర్షిణి, ఊడుగుల మహేంద్ర 85, కామర్స్ లో షేక్ హైమత్ 83, హిస్టరీ లో చల్లగొండ్ల నాగమణి 71 మార్కులు సాధించినట్లు, పదవ తరగతి ఇంగ్లీషులో షేక్ అమ్రిన్ నేహ 72, తెలుగులో పంపన కళ్యాణి 72, గృహ విజ్ఞాన శాస్త్రం లో బానోతు రమాదేవి 83, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ లో పల్లపు అశోక్ 80, సాంఘిక శాస్త్రంలో భానోత్ రమాదేవి 71 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ఇంతటి ఘనవిజయానికి కారకులైన అభ్యాసకులను, అధ్యాపకులను అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :