Monday, 03 August 2026 09:55:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

బీసీ బంధువు నాగ సీతారాములు కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Date : 14 April 2026 12:20 PM Views : 317

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బహుజన మేధావుల చేతుల మీదుగా బీపి మండల్ అవార్డు ప్రధానం బీసీ బంధావుడు, గోకులకృష్ణ ట్రస్ట్ చైర్మన్ గా ఎందరో బీసీ బిడ్డలకు అండగా నిలిచిన భద్రాద్రి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతా రాములుకు ప్రతిష్ఠాత్మక బీపి మండల్ అవార్డు లభించింది. బహుజన అభివృద్ధి దిశగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి మరియు ఉద్య ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏప్రిల్ 13 నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో బడుగుల నాగార్జున యాదవ్, మేకల లలితా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనాగా సీతారాములుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందించారు. బీసీల పితామహుడిగా గుర్తింపు పొందిన బిందెశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థంగా బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్న నాగా సీతారాములుకు ఈ అవార్డు అందచేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవ, బహుజనుల అభ్యున్నతి, యువతలో చైతన్యం కల్పించడం వంటి విభిన్న రంగాల్లో నాగా సీతారాములు గత కొన్ని సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం గర్వకారణమని స్థానిక ప్రజలు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు అభినందనలు తెలియజేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :