తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం, జూలూరుపాడు. ఆగస్టు 17(తెలుగు వెలుగు). జూలూరుపాడు వినోబానగర్ సీతారాం ప్రాజెక్టు లాకులు వద్ద నిరసన వ్యక్తం చేసిన దృశ్యం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భానోతు.ధర్మ లు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కాలువ పనులకు ప్రారంభించి సుమారు 8 సంవత్సరాలు కావస్తున్న పూర్తి కాలేదని ఆ పనులు పెండింగ్లో ఉంటూనే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద కొత్తగా రీ డిజైన్ పేరుతో పనులు ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రధానంగా జూలూరుపాడు మండలానికి వ్యవసాయ భూములకు సాగునీరు చుక్క కూడా అందట్లేదని ఈ రీ డిజైన్ పేరుతో ముగ్గురు మంత్రులు ఈ జిల్లా రైతులకు మోసం చేస్తూ ఉమ్మడి జిల్లాకు నీళ్లు తీసుకుని దాంట్లో కుట్ర పన్నుతున్నారని అందులో భాగంగానే ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సెకండ్ పంప్ హౌస్ పుసుగూడెం వద్ద ప్రారంభించారని ఆ ప్రారంభించిన నీరు చుక్కనీరు కూడా కాలవకు రాలేదని ఇది రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేయటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఈ ప్రభుత్వం మరొకటి కాదని విమర్శించారు పాత డిజైన్ ప్రకారంగా రోలపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల భూములకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయవచ్చని ఆ దిశగా ఆలోచన లేకుండా సాగునీరు ఉన్న సాగర్ కెనాల్ కు లింకు చేసి ఈ నీళ్ల అటు తరలించకేల్లటంలో తీవ్రంగా కుట్ర చేస్తున్నారని ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ఆలోచిస్తున్నారని ప్రభుత్వం ఎంత తీవ్రంగా కుట్ర చేస్తారని అనుకోలేదని ఇప్పటికే అనేక ఆందోళన దీక్షలు జరిగాయని భవిష్యత్తులో రైతాంగం తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల్ నాయకులు రాయలసిద్ధు .సిపిఎం అనుబంధ సంఘం రైతు నాయకులు, కనకరత్నం పార్టీ మండల నాయకులు ఎస్.కె మౌలాలి పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ