Sunday, 02 August 2026 07:48:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ : మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

Date : 02 June 2026 06:07 PM Views : 54

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక పాల్గొని పతాకం ఆవిష్కరించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం టౌన్ రామవరం ప్రాంతంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రామవరం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద జాతీయ పతాకాన్ని మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం టూ ఇంక్లైన్ ఏరియాలో రామవరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆవిర్భావ వేడుకకు హాజరయ్యారు. సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట గల తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రగతి మైదానంలో గల అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అణిచివేతను నీళ్లు నిధులు నియామకాల దోపిడి పై నాడు కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఏ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి 14 ఏళ్లపాటు కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అనంతరం పదేళ్లపాటు అధికారం చేపట్టి తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు 420 అసత్యపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ కలల తెలంగాణను విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనపట్ల అసహనంతో ఉన్నారని, వచ్చేది గులాబీ జెండా ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి, గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మండల అధ్యక్షులు హుస్సేన్, మోరే పార్వతి,విజయలక్ష్మి, రామవరం పట్టణ అధ్యక్షులు మాజీ గౌస్,చంద్రయ్య, సూరిబాబు సురేందర్,అశోక్, రాచపల్లి శీను, ఖాజా బక్ష, నగేష్, అన్వర్ కాజా, షమ్మీ, రాజేందర్, పూర్ణ చందర్రావు,లచ్చిరాం, మనోజ్, పాషా,రాజేష్, కిరణ్, సాగర్,కొయ్యడ శ్రీనివాస్ ప్రసాద్, సాగర్, అమన్, షణ్ముఖ్, షోహల్, చాణక్య ప్రసాద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :