తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఐ డి ఓ సి కార్యాలయంలో జరుగనున్న దిశా కమిటీ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి నిర్వహించనున్న కమిటీ సమావేశం తేదీని త్వరలో ప్రకటించగలమని ఆయన చెప్పారు. కావున జిల్లాకు చెందిన పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ్యులు, ఎంపీపీలు, దిశా కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు కమిటీ సమావేశం వాయిదా పడిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ