Wednesday, 16 September 2026 08:25:32 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గేట్‌ మీటింగ్‌లో అంతరాయం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి.ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య .

Date : 06 September 2026 05:45 PM Views : 138

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గేట్‌ మీటింగ్‌లో అంతరాయం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ.పారిశ్రామిక సంబంధాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించం.ఖబడ్దార్‌... కార్మికులకు ప్రయోజనాలు కలిగించే అగ్రిమెంట్లు పై విషప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం.కొత్తగూడెం ఏరియాలోని పీ.వీ.కే.-5 గని వద్ద సెప్టెంబర్‌ 4న గుర్తింపు సంఘం హోదాలో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఉద్దేశపూర్వకంగా అంతరాయం సృష్టించి, నాయకులతో వాగ్వాదానికి దిగి ఘర్షణ వాతావరణం నెలకొల్పేలా వ్యవహరించిన ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు లగ్గాల అజయ్‌, పేరం వినోద్‌లపై సంస్థ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య ఆదివారం ఒక ప్రకటనలో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి సమక్షంలో యాజమాన్యంతో చర్చలు జరిపి సాధించిన 21 అంశాల ఒప్పందాలు, వాటివల్ల కార్మికులకు కలిగే ప్రయోజనాలను ఏఐటీయూసీ నాయకులు కార్మికులకు వివరిస్తున్న సమయంలో ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తూ, నాయకులతో వాగ్వాదానికి దిగారని వారు ఆరోపించారు.గేట్‌ మీటింగ్‌ను అంతరాయం కలిగించే ఉద్దేశంతో పకడ్బంది వ్యూహంతో వచ్చారని అన్నారు, అయితే సమావేశంలో ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేలా వ్యవహరించడం ద్వారా పారిశ్రామిక సంబంధాలకు విఘాతం కలిగించే పరిస్థితిని సృష్టించారని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు.జనరల్‌ అసిస్టెంట్ల సమస్యను ముందుపెట్టి జరిగిన అసలు ఘటనను పక్కదారి పట్టిస్తూ, కార్మికులు ఒప్పందాలను వ్యతిరేకించినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. కార్మిక సమస్యలపై భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించుకోవాలని, సమావేశాల్లో అంతరాయం సృష్టించడం సరైన విధానం కాదని తెలిపారు.సెప్టెంబర్‌ 4న జరిగిన ఘటనపై అదే రోజు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై వారు ప్రశ్నించారు.ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదో, జాప్యానికి కారణాలు ఏమిటో యాజమాన్యం కార్మికులకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.ఖబడ్దార్‌... కార్మిక ప్రయోజనాలపై విషప్రచారం చేస్తే ఊరుకోం,లగ్గాల అజయ్‌, పేరం వినోద్‌లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఐఎన్‌టీయూసీ నాయకులు ఎక్కడ గేట్‌ మీటింగ్‌లు నిర్వహించినా అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలపై కూడా ఆయా సమావేశాల్లో ప్రశ్నిస్తామని అదేవిధంగా ఇతర సమస్యలపై కూడా కచ్చితంగా ప్రశ్నిస్తామని తెలిపారు.“ఖబడ్దార్‌... ప్రభుత్వ తొత్తు సంఘాలను అడ్డుపెట్టుకుని కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలపై విషం చల్లాలని చూస్తే ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం” అని గట్టయ్య స్పష్టం చేశారు.సెప్టెంబర్‌ 4న జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వారిపై సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లయితే దానిపైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :