Monday, 03 August 2026 03:21:20 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మణుగూరు మున్సిపాలిటీలో నక్ష సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 08 June 2026 06:29 PM Views : 116

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నక్ష పైలట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు భూముల రీ-సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్రంలో వివాదాలు లేని పారదర్శక భూపరిపాలన వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ సర్వే కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్టులకు ఎంపికైన జిల్లాల్లో సర్వే మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో రోవర్ పరికరాల ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆస్తులకు ఖచ్చితమైన సర్వే చేపట్టి, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని మణుగూరు మున్సిపాలిటీ ఎంపికైందని తెలిపారు. ప్రాజెక్టు అమలులో భాగంగా సర్వే మరియు రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 రెవెన్యూ వార్డులు ఉండగా, వాటిని 97 బ్లాక్‌లుగా విభజించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 7,524 ఆస్తులను గుర్తించడం జరిగిందని, వాటిలో 5064 ఆస్తుల సర్వే పూర్తయిందని చెప్పారు. అలాగే 2,074 ఆస్తులకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. నక్ష ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు పారదర్శకమైన భూ రికార్డులను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పనిచేస్తున్నాయి అని తెలిపారు . ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏడి సర్వే శ్రీనివాస్,మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :