తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిన్న అనగా తేదీ 29.09.25 మధ్యాహ్నం 15.00 గంటలకు చింతూరు నుండి హర్యానాకు HR33B6330 కారులో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో మొరంపల్లి బంజర గ్రామం దగ్గర వాహన తనిఖీలు మొత్తం నలుగురిలో ఒక నిందితుణ్ణి పట్టుకొని అట్టి కారులో నుండి నిందితుని వద్ద నుండి 204.930 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ తన కార్ ఓనర్ అయిన ప్రిన్స్ కుమార్ ఆదేశాల ప్రకారం చింతూరు వైపు వెళ్లి అక్కడ ప్రధాన్ ఖారా,లఖన్ హంతాల్ వద్ద గంజాయి లోడ్ చేసుకొని తిరిగి హర్యానా వెళుతుండగా పట్టుకోవడం జరిగిందని పాల్వంచ సీఐ సతీష్ వివరాలను వెల్లడించారు.పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్ నకు తరలించడం జరిగింది.స్వాధీన పరుచుకున్నవి:204.930 కిలోల గంజాయి విలువ Rs. 1,02,46,500/-Maruthi Car No.HR 33 B 6330,ఒక cell phone.నిందితుల వివరాలు:1. సంజీవ్ కుమార్ తండ్రి జయ భగవాన్, కార్ డ్రైవర్, కురుక్షేత్ర హర్యానా.పరారీలో ఉన్న నిందితుల వివరాలు2. ప్రిన్స్ కుమార్ R/o హర్యానా 3. ప్రధాన్ కారా 4. లఖన్ హంతాల్.
Admin
తెలుగు వెలుగు టీవీ