తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలు దాదాపు 3,000 మంది మారు పేర్లు సమస్యతో విజిలెన్స్ ఇబ్బంది పడుతున్నారు వారి సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడున్న గుర్తింపు సంగం గా టీబీజీకేఎస్ మరియు జాతీయ సంఘాలు ఆర్ఎంసి దగ్గర మారుపేరుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అనంతరం ఎలక్షన్ రావడం జరిగింది. కానీ ఆ సమస్య పై గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంలో భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో మారుపేర్ల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ 14 నెలలు గడుస్తున్న ఆ సమస్య సమస్యగానే మిగిలిపోయాంది. ఈనెల రెండవ తారీకు నుండి మారుపేరుల సమస్యతో ఇబ్బంది పడుతున్న డిపెండెంట్ పిల్లలు బెల్లంపల్లి లోని గొల్లెటి నుండి కొత్తగూడెం లోని సింగరేణి హెడ్ ఆఫీస్ వరకు పద యాత్ర చేస్తూ హెడ్ ఆఫీస్ కు రావడం జరిగింది. హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. వారికి టీబీజీకేఎస్ మద్దతు తెలిపింది. అండగా ఉంటుందని తమకు మద్దతుగా నిలుస్తుందని చెప్పటం జరిగింది అనంతరం డీజీఎం పర్సనల్ వరప్రసాద్ గారికి డిపెండెంట్స్ మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని మెమొరాన్నమిచ్చి డిపెండెంట్ల తరఫున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపెండెంట్స్ లతోపాటు టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, కూసాన వీరభద్రం, గడప రాజయ్య వసికర్ల కిరణ్, రాసూరు శంకర్ ,బూర్గుల రవికుమార్, అశోక్, వెంకటేశ్వర్లు, తొగర రాజశేఖర్,కాజా భక్ష, షమ్మీ, రవి, శ్రీను, సిఐటియూ, ఐ ఎఫ్ టి యు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ