Thursday, 17 September 2026 11:01:13 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజా పోరాటాల ద్వారానే పేదల సమస్యలు పరిష్కారం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 15 May 2026 07:07 PM Views : 246

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పోరాటాల ద్వారానే పేదల సమస్యలు పరిష్కారం. పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి.ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం సాగించాలి.సభ్యత్వ నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి.గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి.ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమే.భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యమాలను ఉధృతం చేయాలి.కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. ప్రజా పోరాటాల ద్వారానే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ దిశగా పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి మండల కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజల పక్షాన ఉండి పోరాటాలు నిర్వహించడంలో సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అత్యంత త్వరితగతిన పూర్తి చేసి, గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని నిర్దేశించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరిన్ని ఉద్యమాలు చేపడతామని, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ఆయన కోరారు. సమావేశాల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, జూలూరుపాడు మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్ రావు, చండ్రుగొండ మండల కార్యార్షి బొర్రా కేశవరావు, అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి ఊకే నారాయణ, జిల్లా సమితి సభ్యులు నాగుల్ మీరా, జడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :