Thursday, 17 September 2026 11:49:53 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 28 August 2026 05:42 PM Views : 85

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి.బహుజనులకు విద్యను దూరం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. రాష్ట్రంలోని పేద,బడుగు,బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.మండలంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు ఈబకాయిల సమస్య తీవ్ర ఆటంకంగా మారిందన్నారు.ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండివైఖరి అవలంబిస్తూ,విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమడుతున్నారని మండిపడ్డారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ దీక్షలు చేయడం మానేసి ఢిల్లీలో దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సుమారు రూ.1,500 కోట్లు విడుదల చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు.బీజేపీ నేతలు "ఫీజు బకాయి బీజేపీ లడాయి" అంటూ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ,గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..ఈ మూడు పార్టీలు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.బహుజనులు ఉన్నత విద్యను అభ్యసించడం ఈ పార్టీలకు ఇష్టం లేదని,విద్యను బహుజనులకు దూరం చేయడమే వాటి లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.బహుజన విద్యార్థుల విద్యా హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని యెర్రా కామేష్ పిలుపునిచ్చారు.ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని,లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన జేబీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో జేబీపీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వినయ్,సోనూ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :