Saturday, 18 April 2026 05:07:18 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 September 2025 01:16 PM Views : 391

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం ముఖ్యమంత్రి బెండలపాడు గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని, పెద్ద ఎత్తున పూర్తయిన ఇండ్లలో పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలంపాడు గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని సందర్శించడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సభా ప్రాంగణానికి వచ్చే లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రవాణా, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సహాయం, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తిగా చేయాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలలోపే అన్ని బస్సులు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి బస్సుకు ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించి లబ్ధిదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. సభలో అధిక జనసంచారం కారణంగా ఒత్తిడి తలెత్తే అవకాశమున్నందున చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు సభకు రాకుండా చూడాలని సూచించారు. సభ ముగిసిన తరువాత బస్సుల్లో వచ్చిన లబ్ధిదారులు తిరిగి తమ గమ్యస్థానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా గౌరవానికి అనుగుణంగా ముఖ్యమంత్రి పర్యటన అత్యంత పకడ్బందీగా , విజయవంతంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :