తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్న గిరిజన మహిళ సుజాత కు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దాతలను సంప్రదించింది. స్పందించిన రాజేందర్ సేవా సమితి సభ్యుడు రోహిత్ గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పాజిటివ్ రక్తాన్నిదానం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ సేవా సమితి అధ్యక్షుడు యెర్రా సర్వేష్ మాట్లాడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అనేక మందికి రాజేందర్ సేవా సమితి సభ్యులు రక్తదానం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పాజిటివ్ రక్తాన్ని దానం చేసిన రోహిత్ ను అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ