Wednesday, 16 September 2026 04:09:33 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సాయి ఎక్స్ లెంట్ పాఠశాల విద్యార్థుల ఆటపాటలతో సాగిన వనవిహారయాత్ర

Date : 16 November 2024 07:33 PM Views : 918

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులను శనివారం పాఠశాల చైర్మన్,హుస్సేన్, కరస్పాండెంట్ కె.పి ఉపాధ్యాయని ఉపాధ్యాయులు జూలూరుపాడు లోని మామిడి తోటలోకి వనవిహారయాత్రకు తీసుకొని వెళ్లి పిల్లలతో సరదాగా ఆటపాటలతో గడిపి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు, భోజనాల అనంతరం, విద్యార్థులందరూ ఆడుతూ పాడుతూ సరదాగా కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ పిల్లలను ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఆటపాటలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల చైర్మన్ హుస్సేన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ హుస్సేన్ని, మరియు సిద్ధార్థ పాఠశాల మాజీ చైర్మన్ పూర్ణ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సాయి ఎక్స్ లెంట్ పాఠశాల చైర్మన్ హుస్సేన్ మాట్లాడుతూ,విద్యార్థి దశలో పిల్లలను వన విహారయాత్రలకు తీసుకు వెళ్లడం వలన విద్యార్థులలో ఐక్యమత్యత, కలిసిమెలిసి ఉండే స్వభావం, సోదర సోదరీ భావాలు అలవాడతాయని అన్నారు. విద్యార్థులకు వన విహారయాత్రలు, వన భోజనాలు మధురమైన జ్ఞాపకాలను మిగులుస్తాయన్నారు. పాఠశాలల యాజమాన్యాలు పిక్నిక్ స్పాట్లను ఎంచుకొని విద్యార్థులను విహారయాత్రలకు తీసుకు వెళ్లడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం తో పాటు, మంచి పద్ధతులు, స్నేహభావం,కలసి మెలిసి ఉండే స్వభావాలు అలవాడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ హుస్సేన్, కరస్పాండెంట్ కె.పి, ఉపాధ్యాయనిలు, శారద,.బీ సరిత, ఏ సరిత, జె శివకుమారి, అనిత, నబీన, సాహితి, దుర్గ భవాని, సుజాత, హరిత, రజిత, జమున, అరుణ, సత్యవతి, కుమారి, పావని, ప్రశాంతి, భాను, పద్మావతి, నవ్య, ఉపాధ్యాయులు, రాంబాబు, రామ్ కుమార్, భద్రం, పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :