Sunday, 02 August 2026 01:12:36 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

చలో హైదరాబాద్-ఇందిరాపార్కు ధర్నాను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

Date : 05 July 2026 06:51 PM Views : 102

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇల్లు, ఇంటి స్థలం కోసం రాష్ట్ర రాజధానికి దండుగా కదులుదాం. చలో హైదరాబాద్-ఇందిరాపార్కు ధర్నాను జయప్రదం చేయండి.నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు. గుడిసెల కూల్చివేత చర్యలను ప్రభుత్వం మానుకోవాలి.అర్హులైన ప్రతికుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా. ఇల్లు మరియు ఇంటి స్థలం కోసం నిరుపేదలంతా ఏకమై రాష్ట్ర రాజధానికి దండుగా కదలాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు పోరాటాలు కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం, పేదల ఇండ్ల కూల్చివేతలు నిరసనగా అదేవిధంగా పెదాలు నిర్మించుకున్న ఇండ్లకు విద్యుత్ సౌకర్యంతోపాటు ఇంటి నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సోమవారం నిర్వహించ తలపెట్టిన 'చలో హైదరాబాద్' ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్‌లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న నిరుపేదల గుడిసెల కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు తమ సొంత శ్రమతో నిర్మించుకున్న ఇండ్లకు తక్షణమే ఇంటి నెంబర్లు కేటాయించాలని, అలాగే విద్యుత్, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలా కాకుండా ప్రజావ్యతిరేక విధానాలతో పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరే వరకు, ప్రతి గుడిసెకు పట్టా ఇచ్చే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ రాజధాని ముట్టడి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ టౌన్ కార్యదర్శి కంచర్ల జమలయ్య, నాయకులు రామవరం ఏరియా కార్యదర్శి గోపి కృష్ణ, సర్పంచి వాడె రాములు, కార్పొరేటర్ కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, రాజు, దార లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :