తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పనా చౌదరి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడితే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భవిష్యత్తుకు పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్బంగా పెద్దమ్మతల్లి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక జగన్నాధపురం ప్రాధమిక పాఠశాలను సందర్శించిన ఆమె పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యా సామగ్రి వంటి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలల అభివృద్ధికి కొల్లి ఫౌండేషన్ తరఫున తన వంతు సహకారం అందిస్తామని హెచ్ఎం లత కు కల్పనా చౌదరి హామీ ఇచ్చారు. కల్పనా చౌదరికి పూలజల్లులతో స్వాగతం పలికిన చిన్నారులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలతో సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లత, టీచర్స్ బి శ్రీనివాస్, వై వెంకటేశ్వర్లు, ఈ సుజాత, బిందు, కొల్లి ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ రూప్లా నాయక్, ఉపేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ