తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, అధ్యక్షతన జిల్లాలో అమలవుతున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాలు, వాటి పురోగతి మరియు భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), అదనపు మండల విద్యాధికారి (AMO), సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (CSF) జిల్లా బృందంతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో FLN కార్యక్రమాల అమలు, విద్యార్థుల అభ్యాస స్థాయిలు, ప్రధాన అభ్యాస లోపాలు మరియు వాటి ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో విద్యార్థులలో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు నాణ్యమైన తరగతి బోధన, నిరంతర మూల్యాంకనాలు, అభ్యాస లోపాల ఆధారిత ప్రత్యేక బోధన (Remedial Teaching), మెంటర్ల క్రమబద్ధమైన పాఠశాల సందర్శనలు మరియు FLN Competent Schools కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యబద్ధమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా రానున్న SCERT నిర్వహించే వార్షిక FLN అంచనాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోని టాప్-5 జిల్లాల్లో నిలపాలనే లక్ష్యాన్ని జిల్లా కలెక్టర్ నిర్దేశించారు. ఈ లక్ష్య సాధన కోసం జిల్లా విద్యాశాఖ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (CSF) బృందం సమన్వయంతో పనిచేసి విద్యార్థుల అభ్యాస ఫలితాలను గణనీయంగా మెరుగుపరచాలని, 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యా రంగంలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ