Saturday, 18 April 2026 03:45:58 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

పాల్వంచ నవభారత్ "కాలనీ"లో భారీ చోరీ..!

Date : 26 January 2025 06:43 PM Views : 3596

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం , పాల్వంచ జనవరి 26 ( తెలుగు వెలుగు) పాల్వంచ మండలంలోని నవభారత్ కి చెందిన నవనగర్ కాలనీలోని క్వార్టర్స్ లో దొంగలు పడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన ఆదివారం జరిగింది. నవ నగర్ లోని క్వార్టర్స్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్, ప్రతాప్, అంజద్ పాషాల క్వాటర్స్ తో పాటు మరో ఏడు క్వార్టర్స్ లో దొంగలు చొరబడ్డారు. ఎన్బి-47 క్వార్టర్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్ ఇంట్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3.5 లక్షల నగదుని చోరులు అపహరించారు. క్వార్టర్స్ లోకి చొరబడ్డ దొంగలు ఆయా ఇళ్లల్లోని సామాగ్రిని, బట్టలను చిందరవందరగా పడవేసి హల్చల్ చేశారు. అదేవిధంగా బి-11 క్వార్టర్లో నివాసముంటున్న ప్రతాప్ ఇంట్లో సుమారు 61 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దోచుకు వెళ్లారు. బి-16 క్వార్టర్లోని అంజద్ పాషా ఇంట్లో సుమారు 8 తులాల బంగారం అపహరించు కెళ్ళారు. అదేవిధంగా మిగతా క్వార్టర్స్ లో కూడా చోరీ చోరీ జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ ఆయా యజమానులు ఇంకా నవ నగర్ కు చేరుకోలేదు. సరిగ్గా ఆ క్వార్టర్స్ లో నివాసముండే యజమానులు లేని సమయాన్ని అదునుగా చూసి దొంగలు చొరబడి దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కేవలం ఎంట్రన్స్ లో మాత్రమే రెండు సీసీ కెమెరాలు అమర్చారు. కాలనీలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, నిఘ వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగినట్లుగా అవగతం అవుతుంది. సమాచారం తెలుసుకున్న పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు సుమన్, రామారావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంని రంగంలోకి దించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఎంత మేరకు నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అనే విషయం తెలియాల్సి ఉంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :