తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు. అశ్వాపురం మండలం కళ్యాణపురం గ్రామానికి చెందిన గుమ్మడి సాగర్ ఇంటర్ వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నానని కుటుంబ పోషణ భారంగా ఉన్నదని తనకు ఏదైనా ఒక కార్యాలయంలో అటెండర్ జాబు గాని వాచ్ మెన్ జాబు గాని ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన తలారి ముత్తయ్య ప్రజాపాలన కార్యక్రమంలో ఉచిత కరెంటు కొరకు గృహ జ్యోతి పథకంకి దరఖాస్తు చేసుకోని ఉన్నానని కానీ నా ఇంటికి కరెంట్ బిల్లు వస్తున్నాదని తనకు గృహ జ్యోతి పథకం కింద ఉచిత కరెంటు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం చంద్రుగొండ ఎంపీడీవో కి ఎండార్స్ చేశారు..
ఇల్లందు మండలం ఇందిరానగర్ కు చెందిన మహమ్మద్ సాదిక్ w/o గౌస్ నా భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోయాడని తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాను తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు బెనిఫిట్స్ సరిపోవడం లేదని తన తెల్ల రేషన్ కార్డును అన్నపూర్ణ కార్డుగా మార్చగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా పౌరసరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గతంలో నిర్మించినటువంటి పశువుల భవనం శిథిలావస్థలో ఉన్నదని చుట్టుపక్కల గోడలు కూడా పగిలిపోయి ఉన్నాయని పశువుల వైద్యం కొరకు ఇబ్బందిగా ఉన్నదని వారి గ్రామానికి కొత్త పశువుల భవనము మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా పశుసంవర్ధక అధికారికి ఎండార్స్ చేశారు.. చుంచుపల్లి తండాకు చెందిన బానోతు రమేష్ నాయక్ తమ పిల్లలు లక్ష్మీదేవి పల్లి మండలం త్రివేణి పాఠశాల నందు ఏడు, ఆరో తరగతి చదివి ప్రస్తుతం వేరే పాఠశాలలో చదువుతున్నారని తమ పిల్లలకు టీసీ ఇవ్వాలని పాఠశాలలో దరఖాస్తు చేసుకోగా నేటి వరకు టిసి ఇవ్వడం లేదని కావున మా పిల్లలకు టిసి ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి కి ఎండార్స్ చేశారు..
బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామంలో 37 కుటుంబాలతో జీవనం సాగిస్తున్నామని ప్రధాన రహదారి నుంచి మా గ్రామానికి వెళ్లడానికి రోడ్డు వసతి లేక ఇబ్బందులకు గురవుతున్నామని అంతేకాకుండా వారి గ్రామంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉండదని చిన్నపిల్లలు చదువుకోడానికి అంగన్వాడి మరియు పాఠశాల లేవని కరెంటు కూడా లేక ఇబ్బందులకు గురవుతున్నామని కావున వారి గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేసిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్య నిమిత్తం డి సెక్షన్ కి ఎండార్స్ చేశారు.. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ