తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.గాజులరాజం బస్తీ బోనాల పండుగ వేడుకల్లో టీపీసీసీ కార్యదర్శి నాగా సీతారాములు.పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని టీపీసీసీ కార్యదర్శి నాగా సీతారాములు ఆకాంక్షించారు. గాజులరాజం బస్తీలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాల్గొన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని కోరుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.బోనాల పండుగ సందర్భంగా గాజులరాజం బస్తీలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక కాంగ్రెస్,సీపిఐ నాయకులు,కార్యకర్తలు,బస్తీ ప్రజలు, మహిళలు,భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ