తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐడీఓసీ (IDOC) సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయము నందు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ రూమ్ ( బాలింత పాలు ఇచ్చే ప్రదేశం) ని రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ ప్రారంభించడం జరిగింది . ఏర్పాటు చేసిన హబ్ సిబ్బంది ని అభినందించారు . వారు మాట్లాడుతూ కలెక్టరేట్ కి వివిధ పనుల నిమిత్తం చంటి పిల్లలతో వచ్చే తల్లులు తమ పిల్లలకు పాలు పట్టించాలంటే ఇబ్బంది గా ఉంటుందని అందరి ముందు పిల్లలకు పాలు ఇవ్వలేరని వారు సంశయిస్తుంటారని , వీటిని ఏర్పాటు చేయటం వలన వారు నిస్సంకోచంగా ఉపయోగించుకోగలుగుతారని అన్నారు . ఇలాంటి కేంద్రాలను బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ లో కూడా ఏర్పాటు చేయ వలసినది గా సూచించారు .ఈ కార్యక్రమంలో ఇంకా వారు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం వంటి అంశాలపై తల్లులకు ఎక్కువగా అవగాహన కల్పించాలని, జననం తర్వాత తొలి ఆరు నెలలు శిశువుకు కేవలం తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్థాయి లో తల్లులకు వివరించాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లెనీనా వారి సిబంది హసీనా , భార్గవి , ఐసిడిఎస్ సీ డీ పి ఓ లు ప్రసన్న లక్ష్మి , పద్మ శ్రీ , తార , సలోమి , అరుణ , జయలక్ష్మి , జ్యోతి , చైతన్య మరియు సూపర్వైజర్స్, DHEW కోఆర్డినేటర్ సంతోష రూప మరియు సిబ్బంది ,సఖి రాజమణి , సునీత మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ