తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయడానికి ఈనెల 21వ తారీఖున కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని పూర్వము 29 చట్టాలను కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏవో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరండం ఇచ్చిన వారిలో ఎఐటీయుసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్యనాయకులు టిబిజికెఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, కూసాన వీరభద్రం ఏఐటీయూసీ నాయకులు వంగ వెంకట్, వీరస్వామి, intuc వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, పీతాంబరం , సిఐటియు రాజారావు, ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ