Thursday, 17 September 2026 10:02:14 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం : ఎస్ కె సాబీర్ పాషా

Date : 23 July 2026 05:19 PM Views : 144

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటు హక్కుపై సిపిఐ విస్తృత ప్రచారం ఎస్ఐఆర్ ప్రక్రియపై గడపగడపకూ అవగాహన ఓటర్ జాబితా సవరణపై సిపిఐ ఆటో ప్రచారం ఎస్ఐఆర్ ఫారం అందించకుంటే జరిగే నష్టంపై అవగాహన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన బస్తీలు, గ్రామాల్లో ఐదు ప్రచార ఆటోల ద్వారా ఈ మైకు ప్రచారాన్ని రెండో రోజైన గురువారం అయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను సరైన వివరాలతో నింపి తిరిగి ఎన్నికల అధికారులకు అందించే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫారాలను సరిగా సమర్పించకుంటే ఎదురయ్యే నష్టాలను, ప్రక్రియ షెడ్యూల్ విశేషాలను మైకుల ద్వారా వీధి వీధినా ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యంలో నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ శీఘ్రగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, వంతెనల నిర్మాణం, సంక్షేమ పథకాలు, నిధుల సేకరణ ద్వారా నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం, ఓటు హక్కు నమోదు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తమ పార్టీ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :