Sunday, 02 August 2026 06:14:20 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం : ఎస్ కె సాబీర్ పాషా

Date : 23 July 2026 05:19 PM Views : 69

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటు హక్కుపై సిపిఐ విస్తృత ప్రచారం ఎస్ఐఆర్ ప్రక్రియపై గడపగడపకూ అవగాహన ఓటర్ జాబితా సవరణపై సిపిఐ ఆటో ప్రచారం ఎస్ఐఆర్ ఫారం అందించకుంటే జరిగే నష్టంపై అవగాహన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన బస్తీలు, గ్రామాల్లో ఐదు ప్రచార ఆటోల ద్వారా ఈ మైకు ప్రచారాన్ని రెండో రోజైన గురువారం అయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను సరైన వివరాలతో నింపి తిరిగి ఎన్నికల అధికారులకు అందించే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫారాలను సరిగా సమర్పించకుంటే ఎదురయ్యే నష్టాలను, ప్రక్రియ షెడ్యూల్ విశేషాలను మైకుల ద్వారా వీధి వీధినా ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యంలో నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ శీఘ్రగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, వంతెనల నిర్మాణం, సంక్షేమ పథకాలు, నిధుల సేకరణ ద్వారా నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం, ఓటు హక్కు నమోదు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తమ పార్టీ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :