తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 28(తెలుగు వెలుగు)రైతు రుణమాఫీ పథకాన్ని రెండు లక్షల రూపాయలు వరకు ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చండ్ర నరేంద్ర కుమార్ .ముత్యాల విశ్వనాథంలు. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు రైతు రుణమాఫీ పథకానికి ప్రకటించిన నియమ నిబంధనలు రైతాంగానికి ఆశనిపాతం లా మారాయని వారన్నారు, పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు రుణమాఫీ పథకం వర్తించదని అనడం విచిత్రంగా ఉంది అన్నారు, ధర్నా అనంతరం జిల్లా రైతు సంఘం కార్యదర్శులు చంద్ర నరేంద్ర కుమార్ ఏవో గన్యా నాయక్ కు వినతి పత్రం అందజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ